రథసప్తమి

హిందు ధర్మము మరియు భారతీయ సంస్కృతిలో శ్రేష్ట దేవతల ఉపాసన మరియు వారి వివిధ పండుగలు మరియు ఉత్సవములున్నాయి. అలాగే వాటిలో కనిష్ఠ దేవతల ఉపాసన కూడ చెప్పబడినది. సూర్య-చంద్ర, అగ్ని, వాయువు, వరుణ మరియు ఇంద్ర వీరు ప్రముఖ కనిష్ఠ దేవతలు. మానవుడి జీవితములో మరియు సర్వ ప్రాణిమాత్రుల జీవితములో ఈ కనిష్ఠ దేవతల మహాత్వమైన స్థానము కలదు. భారతీయ సంస్కృతి వీరందరికి కతజ్ఞత వ్యక్తపరుచుటకు నేర్పిస్తుంది. దీనిని అనుసరించి సూర్యదేవుడికి కతజ్ఞత వ్యక్తపరుచుటకు ‘రథసప్తమి’ పండుగను జరుపుకొంటారు. ఈ రోజున సూర్యోపాసన చేయవలసి వుంటుంది. భారతీయ సంస్కృతి మరియు హిందు ధర్మములో సూర్యోపాసనకు విశేషమైన మహాత్వమును ఇవ్వడమైనది.

 

1. తిథి

మాఘ శుక్ల పక్ష సప్తమి. మాఘమాసములో శుక్లపక్షంలో వచ్చే సప్తమినాడు రథసప్తమిని జరుపుకొంటారు. ఈ తిథి సూర్యదేవునికి సంబంధించినది. మహార్షి కశ్యపుడు మరియు దేవమాత ఆదితి వీరి కడుపున సూర్యదేవుడు జన్మించిన దినము ! భగవాన్ శ్రీవిష్ణువు యొక్క ఒక రూపము అనగా శ్రీ సూర్యనారాయణుడు. సంపూర్ణ జగమును తన మహాతేజ స్వరూపముతో ప్రకాశవంతంగా చేయు సూర్యదేవుని వలన పథ్విపై జీవితము అస్తిత్వములో వున్నది. ఈ రోజు నుండి సూర్యుడు తన రథములో కూర్చోని ప్రయాణిస్తాడు. ఈ రథమునకు ఏడు గుర్రములు వుంటాయి; అందుకని రథసప్తమి అను పదమును వుపయోగించడమైనది. ఈ రోజు సూర్యోపాసన చేయడం వలన ఉపాసకులు సూర్యుని తేజతత్వతరంగాలను అధికంగా సేకరించుకోగలుగుతారు. ఈ తరంగాల వలన ఉపాసకులకు బలం ప్రాప్తిస్తుంది.

 

2. ప్రాముఖ్యత

సంఖ్యలన్నిటిలో ‘ఏడు’ ఈ అంకేకు విశేషమైన మహత్వము కలదు. ‘ఏడు’ ఈ అంకే త్రిగుణములు సమతోలముగా వుండుటతోపాటు సత్వగుణము వది ్ధకొరకు ఆవశ్యకమైన చైతన్యము, ఆనందము మొదలగు సూక్ష్మతరంగాలను గ్రహణము చేయుటకు విశేషమైన క్షమత వుంటుంది. సప్తమి ఈ తిథికి శక్తి మరియు చైతన్యము యొక్క సుందరమైన సంగమము జరుగుతుంది. ఈ రోజున విశిష్ట దేవతల తత్వము మరియు శక్తి, ఆనందము మరియు శాంతి వీటి తరంగాలు 20శాతము కన్న ఎక్కువ ప్రమాణములో కార్యనిరతరమై వుంటాయి. రథసప్తమి రోజున నిర్గుణ సూర్యుని (అతిసూక్ష్మ సూర్యతత్వము యొక్క) తరంగాలు ఇతర రోజులతో పోల్చితే 30శాతము ఎక్కువగా కార్యనిరతరమగును.

 

3. సూర్యుడి రథము మరియు దాని పూజ

సూర్యుడి రథములో సూర్యలోకము, నక్షత్రలోకము, భువలోకము, నాగలోకము, స్వర్గలోకము మరియు స్వర్గలోకమునకు దగ్గర వున్న శివలోకము ఈ సప్తలోకములలో భ్రమణ చేయు సామర్థము కలదు. రథము యొక్క వేగము ఆవశ్యకమైనంత ప్రమాణములో మారుతువుంటుంది. సూర్యదేవుడి ఇచ్ఛ ప్రకారంగా రథము వాయుమండలములో ఎగురుతు ప్రయాణిస్తుంది. రథము యొక్క బంగారు చక్రములపై సంపూర్ణంగా సూర్యుని చిత్రమును నిధానంగా గీస్తారు. ఆ చిత్రములో నుండి సూర్యుడి తేజస్సు మరియు తేజతత్వము చుట్టుప్రక్కలలో 30 శాతము ప్రక్షేపితమగును. శ్రీవిష్ణువు యొక్క కపాశీర్వాదముతో మరియు తేజతత్వము యొక్క ప్రక్షేపన వలన రథము చుట్టు సంరక్షణకవచము నిర్మాణమగుటవలన సూర్యదేవుని కార్యములో దుష్టశక్తులు ఇబ్బందులు నిర్మాణము చేయలేవు. సూర్యదేవుడు ప్రతి నిత్యము రథముపై విరాజమానమై వుంటాడు. రథము ఆయన యొక్క వాహనము. దేవుడు దేవాలయములో వుండుటవలన దేవాలయమునకు శ్రేష్ఠత్వము ప్రాప్తమౌతుంది. అలాగే సూర్యుడి రథమునకు శ్రేష్ఠత్వము కలదు. ఇందుచేత ‘రథసప్తమి’నాడు సూర్యుడి ఉపాసనతో పాటు ప్రతికాత్మకంగా రథమును కూడ పూజిస్తారు.

 

4. రథసప్తమి వ్రతమును ఆచరించే విధానము

రథసప్తమి వ్రతం ఆచరించుటకు షష్ఠి రోజు ఉపవాసం వుంటారు. సప్తమినాడు అన్ని విధులను పాటిస్తూ సూర్యోదయం కన్నా 1 గంట 36 నిమిషముల ముందు తెల్లనువ్వులు కలిపిన జలముతో స్నానం చేస్తారు. అలాగే వ్యాధినివారణ మరియు ఆరోగ్యప్రాప్తి కొరకు వ్రతము ఆచరించుటకు సంకల్పం చేస్తారు. ఇంటి ముందు వాకిలిని శుభ్రం పరిచి వీలైతే నేలను ఆవుపేడతో అలికి, ముగ్గులు వేసి అలంకరించాలి.

పీఠపై ముగ్గుతో లేదా చందనముతో ఏడు గుర్రములు వున్న సూర్యనారాయణుని రథము, అరుణ సారథిని మరియు సూర్యనారాయణ భగవానుని తయారు చేసి పీటను ముగ్గులతో అలంకరించిన చోట పెట్టి షోడశోపచార పూజ చేస్తారు. ఆ తరువాత వాకిట్లో ఆవు పేడ పిడకలను కాల్చి వాటిపై పూజ చేయబడిన మట్టి కుండలో పాలును పొంగిస్తారు. అగ్నిలో సమర్పణమయ్యేదాక పాలును పొంగించి, తరువాత దానిని సూర్య భగవానుడికి అర్పిస్తారు. మిగిలినపాలును అందరికి ప్రసాదంగా పంచుతారు.

 

5. రథసప్తమి రోజున చేయబడే సూర్యదేవుని పూజవిధి

రథసప్తమికి వ్యక్తి అరుణోదయమున స్నానము చేయవలెను. సూర్యుడి 12 పేర్లను పలుకుతు కనీసము 12 సూర్యనమస్కారములు చేయవలెను. పీఠపై రథములో కూర్చున్న సూర్యనారాయణుడి చిత్రము వ్రాసి పూజ చేయవలెను. వారికి రక్తచందనము, అక్షింతలు, ఎర్ర పువ్వులు, గరిక వేసిన జలముతో ‘మిత్రాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి’, ‘రవయే నమః ఇదమర్ఘ్యం సమర్పయామి” అంటూ 12 నామాలను ఉచ్ఛరించి ప్రతీ ఒక్క నామముతో అర్ఘ్యమును సమర్పించవలెను. చేటలో ఎర్ర రవిక మరియు ఏడు రకాల దాన్యములను పోసి వాటిని బ్రాహ్మణుడికి దానమివ్వవలెను. ఆ తరువాత తీర్థ ప్రాశనము చేయవలెను. ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించమని సూర్యభగవానుడికి ప్రార్థన చేసి ఆదిత్యహదయస్తోత్రము, సూర్యాష్టకము మరియు సూర్యకవచము, వీటిలో ఏదైన ఒక స్తోత్రమును భక్తిభావముతో పఠించవలెను లేదా వినవలెను. రథసప్తమి రోజున ఏ విధమైన వ్యసనము చేయకూడదు. రథసప్తమికి మరుసటి రోజు నుండి ప్రతిరోజు సూర్యునికి ప్రార్థన మరియు సూర్యనమస్కారము చేయవలెను. దీనితో మనకు ఉత్తమ ఆరోగ్యము లభిస్తుంది.

ఈ వ్రతమును ముగించేందుకు రెండవ రోజున వీలైతే, బ్రాహ్మణునికి భోజనం పెడతారు, లేక వంట వండుకోవడానికి కావలసిన సరుకులు ఇస్తారు. అలాగే ఉపవాసాన్ని విరమిస్తారు.

సందర్భము : సనాతన ప్రచురణ ‘పండుగలు, ధార్మిక ఉత్సవములు మరియు వ్రతాలు’(హిందీ)

Leave a Comment