మకర సంక్రాంతి

మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. హిందు ధర్మములో సంక్రాంతిని దేవతగా భావిస్తారు. ఈ రోజున ప్రతి ఒక్కరు ‘బెల్లము-నువ్వులను పంచుతు మధురంగా మాట్లాడుతు స్నేహముగా వుంటారు మరియు వారి-వారి మధ్య గల కలాహలను మరిచి ప్రేమభావమును పెంచుకొనుటకు ఈ పండుగను జరుపుకుంటారు.

 

1. తిథి

ఈ పండుగ తిథి వాచకము కాకుండ అయన-వాచకమైనది. ఈ రోజున సూర్యుడి నిరయనము మకరరాశిలో సంక్రమణమౌతుంది అనగా సూర్యుడు మకరరాశిలో సంక్రమణమవుతాడు; అందుకే దీనిని ‘మకర సంక్రాంతి’ అని అంటారు. సూర్యభ్రమణము వలన జరిగే అంతర్యమును పూర్తి చేయుటకు ప్రతి ఎనబై సంవత్సరాలకు సంక్రాంతి ఒక రోజు ముందుకు సాగుతుంది. ఈ సారి సంక్రాంతిని 15వ జనవరికి జరుపబడుతుంది.

 

2. ఇతిహాసము

సంక్రాంతిని దేవతగా నమ్ముతారు. సంక్రాంతిదేవి సంకరాసురుడను దానవుణ్ణి వధించిన దినము అను కథ వున్నది.

 

3. ప్రాముఖ్యత

సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి సంక్రాంతిగా వ్యవహరింబడుతుంది. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని మకర సంక్రాంతి అంటారు. ఇలా సంక్రమణ చెంది సూర్యగమనము ఉత్తరదిశగా మారి ‘ఉత్తరాయణ-పుణ్యకాలము’ ప్రారంభమౌతుంది. సూర్యుడు మిథున రాశి నుంచి కర్క రాశిలో కర్కాటక సంక్రమణంలో ప్రవేశిస్తాడు. అది దక్షిణాయనం. ఈ రెండు (ఒక్కొక్కటి ఆరుమాసాలు) అయనాలు పూర్తి అయితే ఒక సంవత్సరము పూర్తి అవుతుంది. దక్షిణాయనములో మరణించిన వ్యక్తి ఉత్తరాయణములో మరణించిన వ్యక్తి కంటే దక్షిణలోకములో (యమలోకములో)కి వెళ్ళే అవకాశము ఎక్కువ వుంటుంది.

ఉత్తరాయణం దేవతలకు పగలుగా ఉంటుంది. కనుకనే దేవతలకు పగటి కాలంలో యజ్ఞయాగాదులు చేసి దేవతల అనుగ్రహాన్ని పొందుటను సూచిస్తుంది ఈ ‘మకర సంక్రాంతి’. పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలము మనకు ఉత్తమ లోకప్రాప్తి కలిగిస్తుంది.

మకర సంక్రాంతి కాలములో తీర్థస్నానమునకు విశేషమైన ప్రాముఖ్యత కలదు. గంగా, యమున, గోదావరి, కష్ణా మరియు కావేరి నదుల క్షేత్రములకు వెళ్ళి స్నానము చేసేవారికి మహాపుణ్యము ప్రాప్తిస్తుంది.

3 అ. సాధనపరంగా ప్రాముఖ్యత

మకర సంక్రాంతి రోజున సూర్యోదయము నుండి సూర్యస్తము వరకు వాతావరణములో చైతన్యము అధికంగా ఉంటుంది. ఈ రోజున బ్రహ్మాండములో ఆపతత్వము, మరియు తేజతత్వమునకు సంబంధించిన కార్యము చేయు భగవంతుని క్రియాతరంగాల ప్రమాణము అధికంగా వుండును. ఇందుకని ప్రతి ఒక్కరు రజ-తమను పెంచుకోకుండ అధికధికంగా సాత్వికతను నిర్మాణము చేసే క్రతువు ద్వారా చైతన్యము యొక్క లాభమును పొందవలెను. మకర సంక్రాంతి పండుగా సాధన కొరకు అనుకూలమైనటువంటిది. కావున ఈ రోజున అధికధికంగా సాధన చేసి భగవంతుడి మరియు గురువుల నుండి చైతన్యమును పొందుటకు ప్రయత్నించవలెను.

3 ఆ. దానము

మకర సంక్రాంతి నుండి రథసప్తమి వరకు ఉన్న కాలమును ‘పర్వకాలము’ అంటారు. ధర్మశాస్త్రమనుసారంగా ఈ పర్వకాలములో చేసిన దానము, జపము మరియు ధార్మిక అనుష్ఠానమునకు అత్యంతమైన ప్రాముఖ్యత కలదు. ఈ దినమున చేసిన దానము పునరఃజన్మలో వంద రేట్లు ప్రాప్తమగును. ఈ పుణ్యదినమున యథాశక్తి కొత్త పాత్రలు, వస్త్రాలు, అన్నము, నువ్వులు, బెల్లము, గోవు, గుర్రము, స్వర్ణము మరియు భూమిని దానధర్మాలు చేయుటవల్ల జన్మజన్మల దారిద్య్ర బాధలు అంటవని, అలాగే ‘స్త్రీలు’ పూలు, పసుపు, కుంకుమ, పండ్లు మరియు సాత్వికమైన వస్తువులు (సద్గ్రంథాలు, పూజ సామాగ్రీలు, దేవుళ్ళ సాత్విక చిత్రాలు) దానము చేయుటవల్ల సకల సంపదలతో పాటు చక్కని సౌభాగ్యం కలుగుతుంది. ఈ రోజున సౌభాగ్యవతులు ఒకరికొకరు పసుపు-కుంకుమలను పెట్టి, ఒడి నింపి ఉపాయనమునిస్తారు; అంటే ఎదుటి స్త్రీలోని శ్రీ దుర్గదేవి యొక్క అప్రకట శక్తిని జాగృతపరచటము మరియు దేవిని భక్తిభావముతో ఆహ్వానించి ఆమెను పూజించి తనువు, మనస్సు మరియు ధనముతో ఆమెకు శరణు వెళ్ళుట అనగా శ్రీ దుర్గదేవి యొక్క కృపాద్రష్ఠిని పొందుటయే దీని అర్థము. ఈ దానమును ‘ఉపాయనము’ అని అంటారు. సాత్వికమైన ఉపాయనము ఇవ్వటము వలన భగవంతుడితో అనుసంధానమై ఉపాయనము ఇచ్చేవారికి మరియు పుచ్చుకొనేవారికి చైతన్యము లభిస్తుంది. సాత్విక ఉపాయనము ఇవ్వటము ఇది ఒక ధర్మప్రసారమైనందువలన భగవంతుని కృపకు పాత్రులై వాంఛిత ఫలము పొందుతారు.

 

4. సంక్రాంతి రోజున చిన్న పిల్లలపై రేగుపండ్లు (బోగి పండ్లు) పోయుట

ప్రథమంగా హారతినిచ్చి పిల్లల మస్తకముపై రేణగాయలు, చెరకు ముక్కలు, వేరుసెనగలు మరియు పేలాలు ఈ పదార్థములను ఏకత్రితము చేసి పోస్తారు. దీనినే రేగుపండ్లు లేదా బోగి పండ్లు అని అంటారు. క్రింద పడిన ఈ పదార్థములను పిల్లలు ఏరుకొని వాటిని తింటారు. ఆ తరువాత సౌభాగ్యవతులు పసుపు-కుంకుమలను ఇస్తారు. రేగుపండ్లు పోయుట వలన పిల్లలకు రాబోయే వేసవి కాలములో బాధ కలుగకుండ వుంటుదని మరియు వారి ఆరోగ్యము బాగుగా వుంటుందని భావిస్తారు. ఈ సంస్కారము ముఖ్యంగా మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందినది.

 

5. సంక్రాంతి రోజున నువ్వులను ఉపయోగించుటకు గల ప్రాముఖ్యత

నువ్వులలో సాత్విక తరంగాలను గ్రహణము మరియు ప్రక్షేపణ చేయు క్షమత అధికంగా వున్నందువలన నువ్వులు, బెల్లమును సేవించుట వలన ఆంతరికశుద్ధి జరిగి సాధన బాగ జరుగుతుంది. సంక్రాంతి రోజున నువ్వులను వాడడం ద్వారా పాపక్షాలనమవుతుంది, ఉదా. నువ్వులు వేసిన నీటితో స్నానము చేయటము, నువ్వుల లడ్డులను తినటము, నువ్వులు కలిపిన మంచినీళ్ళను త్రాగటము మరియు ఇతరులకు ఇవ్వటము, బ్రాహ్మణులకు నువ్వుల దానము చేయటము, శివుని దేవాలయములో నువ్వుల నూనేతో దీపము వెలగించటము, పిత్రుదేవతారాధనలో నువ్వుల జలముతో తర్పణము చేయుటవల్ల వారి శుభాశీస్సులతో వారి వారి వంశాలు వర్ధిల్లుతాయని శాస్త్రము చెబుతుంది.

 

6. కనుమ

ఈ రోజున రైతన్నలకు అత్యంత ప్రీతి పాత్రమైనది. వారికి ఏ లోటు లేకుండా పాడిని అందించే ‘గోమాతను’ వ్యవసాయ పనులలో రైతన్నకు చేదోడుగా ఉంటూ చివరికి ‘ధాన్యపు రాశులను’ ఇంటికి చేర్చువరకు తోడ్పడే ‘బసవన్న’కు పూజలు జరిపి పసుపుల పండుగా చేస్తారు. సంక్రాంతికి నెల రోజుల ముందు నుండి వాకిట్లో ముగ్గులు వేసి గొబ్బెమ్మలను అలంకిరించి పాటలు పాడుతుంటారు. బోగి మంటలు వేస్తారు.

 

7. నిషేధము(వర్జము)

అ. సంక్రాంతి పర్వకాలములో పళ్ళు తోముకొనుట, కఠోరంగా మాట్లాడుట, వృక్షములు మరియు గడ్డిని కోయుట మరియు లైంగిక భావనలను ఉత్తేజపరచే కృత్యములు చేయుట వీటిని మానుకోవలెను.

ఆ. గాలిపటమును ఎగురవేయకూడదు ! : నేడు దేశము మరియు ధర్మము సంకటములో వున్నప్పుడు గాలిపటాన్ని ఎగురవేయటమనేది ‘రోమ్ దేశము నిప్పులో కాలుతున్నప్పుడు నీరో శింగినాదము(ఇంగ్లీషు సారంగి, ఫిడేల్) వాయించుచుండెను’, అలాగ అవుతుంది. గాలిపటము ఎగురవేయుటకు సమయమును వ్యర్థపరుచుటకంటే దానిని దేశ వికాసము కొరకు వుపయోగించినట్లైతే, దేశము త్వరగా ప్రగతి మార్గమున ప్రయాణించును. సాధన మరియు ధర్మకార్యము కొరకు వుపయోగించినచో తనతో పాటు సమాజ కాల్యాణమగును’.

ఇ. సంక్రాంతి రోజున నల్లరంగు వస్త్రములు ధరించే దానికి ఏ ధర్మగ్రంథము యొక్క ఆధారము లేనందునవలన ఈ రోజున నల్లరంగు గల వస్త్రములు ధరించకూడదు. హిందుధర్మములో నల్లరంగును అశుభముగా భావించడమైనది, అలాగే ఆధ్యాత్మికశాస్త్రానుసారంగా నల్లరంగు వాతావరణములోని తమోగుణ స్పందనలను ఆకర్షింప చేసుకొంటుంది మరియు నల్లరంగు వస్త్రములను ధరించిన వ్యక్తికి ఈ తమోగుణ స్పందనల ఇబ్బంది కలుగుతుంది.

సందర్భము : సనాతన ప్రచురణ ‘పండుగలు, ధార్మిక ఉత్సవములు మరియు వ్రతాలు’(హిందీ), దిన పత్రిక సనాతన ప్రభాత్ (మరాఠి)

Leave a Comment