హిందుత్వనిష్ఠ ఆలోచనావేత్తలను ఐక్యపరచడం ముఖ్యం !

సమయ సమయానికి హిందూ దేశ స్థాపన కార్యము యొక్క దిశను నిశ్చయించుకొనుట, ఆలోచనల ఇచ్చి-పుచ్చుకొనుట మరియు ఒకరికొకరిలో సమన్వయం సాధించుటకు ఒక వేదిక అవసరం. నేడు అన్ని క్షేత్రాల ప్రజలు ఐక్యమౌతున్నారు, అంటే వారికి వేదిక ఉంది; కాని హిందుత్వనిష్ఠ ఆలోచనావేత్తలకు స్వంత వేదిక లేదు. వ్యక్తిగత లాభాలకు, స్వార్థం కొరకు సమాజములోని అనేక వర్గాలకు చెందినవారు వివిధ సంఘాల మాధ్యమంగా ఐక్యమౌతున్నారు, కాని సమాజము, దేశము మరియు ధర్మం కోసం నిర్భయంగా కార్యం చేస్తున్న విచారవంతులు మాత్రము అలిప్తంగా ఉండి కార్యం చేస్తే ఏ ప్రయోజనము ఉండదు. నేడు అలిప్తంగా ఉండి కార్యం చేస్తున్న హిందుత్వనిష్ఠ విచారవాదులందరూ ఐక్యమై హిందూ దేశ స్థాపన కొరకు కార్యం చేయుటకు ప్రారంభిస్తే, ‘హిందూ దేశ స్థాపన’ అనే సంకల్పమునకు సమాజము యొక్క దృక్పథంలో ఒక కొత్త రకమైన మార్పును చూడవచ్చు. ‘హిందూ దేశం’ సంకల్పము కేవలం జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తుత పరిచి సమాజం యొక్క అభిప్రాయమును పొందుటలో విచారవాదులు ముఖ్యమైన పాత్రను వహించగలరు. హిందూ దేశ కార్యము ఊపందుకొనుటకు హిందుత్వవాది విచారవాదులందరూ జాతీయ స్థాయిలో ఐక్యమవ్వాలి మరియు దీని యొక్క బాధ్యతను కూడా విచారవాదులే వహించాలి.’
(సందర్భము : సనాతన గ్రంథము ‘హిందు దేశ స్థాపన యొక్క దిశ’)

Leave a Comment